Denduluru: జనసైనికా తస్మాత్ జాగ్రత్త

విశాఖ స్టీల్ ప్లాంట్ సభకు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కాబట్టి ఈ సభకు వెళ్లే జనసైనికులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వాహనాల్లో వారు వెళ్ళేటప్పుడు ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా వెళ్ళాలని, అలానే హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరిగా తీసుకు వెళ్ళాలని మీటింగుకి వెళ్లే వారిని ఆపి పోలీస్ చలానాలు విధించడానికి సిద్ధంగా ఉంటారని, అలానే సభలో ఉండేటపుడు జేబుదొంగలు ఉంటారని మొబైల్ ఫొనులు, పర్సు ఇంకా విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలని… అలానే కావాలని గొడవపడి గందరగోళం సృష్టించడానికి అధికారపార్టీ కార్యకర్తలు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు పల్నాటి సాగర్, కోటగిరి వెంకట సుధాకర్ తెలిపారు.