డంప్ యార్డ్ ని అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని జనసేన డిమాండ్

చిత్తూరు నగరంలోని లెనిన్ నగర్ డంప్ యార్డ్ వద్ద ఉన్న ప్రజలు డంప్ యార్డ్ అక్కడ ఉండటం వల్ల, వాళ్ళు అనుభవిస్తున్న సమస్యలను తెలియచేయడం జరిగింది. డంప్ యార్డ్ ని అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి లేదా ప్రత్యామ్నాయం చూపించమని మునిసిపల్ అధికారులకు రెందు నెలల ముందు తెలియజేయడం జరిగింది. మునిసిపల్ కమీషనర్ సానుకూలంగా స్పందించి చర్యలు చేపట్టారు, సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి ఇంకా ఒక నెల రోజులు పడుతుంది అని మాట ఇచ్చారు. అక్కడి ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. సమస్యలు ఎక్కడ ఉన్న అక్కడ జనసేన ప్రజలకు మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కవితా అరణి, రాష్ట్ర కార్యదర్శి ఏ కే శరవణ, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పుష్ప, కనిష్క, వినోద్, కృష్ణ, హేమ, ఖాదర్, నూర్, సురేష్ మరియు లెనిన్ నగర్ ప్రజలు పాల్గొన్నారు.