నూజివీడుని విజయవాడ జిల్లాలోనే ఉంచాలని జనసేన డిమాండ్

కృష్ణా జిల్లాలో ఉన్న నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ, నూజివీడుని విజయవాడ జిల్లాలోనే ఉంచాలని కోరుతూ, జిల్లాల విభజనలో నూజివీడు పరిసర ప్రాంత ప్రజలకు జరిగిన అన్యాయంపై నూజివీడు జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో కృష్ణాజిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మత్తె వెంకటేశ్వరరావు మరియు జనసేన మత్స్యకార సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగేందర్ తో కలిసి పాల్గొని సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గం నాయకులు పాశం నాగబాబు. ఈ కార్యక్రమములో నియోజకవర్గ జనసేన పార్టీ మండల అధ్యక్షులు, జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.