శ్రీరామనవమి సందర్భంగా మహిళా పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన జనసేన

గుంటూరు, గుంటూరు నగరంలోని చైతన్యపురిలో జనసేన పార్టీ నాయకులు అన్నదాసు వెంకట సుబ్బారావు ఇంటి వద్ద నవమి సందర్భంగా జేఎస్పీ రాయల్ సోల్జర్స్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానికంగా పనిచేసే 150 మంది మహిళా పారిశుధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సంస్కృతులను కాపాడే ప్రధాన లక్ష్యంగా జనసేన ముందుకు వెళ్తుందని, అందులో భాగంగానే నేడు ఈ కల్యాణం జరిపించి, పేద వారికి అండగా నిలిచి, వారిని సత్కరించామని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు ఆకర్షితులై స్థానిక లంబాడి ప్రాంత యువకులు 100 మంది పార్టీలో చేరారని తెలిపారు. కల్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రానం మార్కండేయ బాబు, వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మ చరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, అధికార ప్రతినిధి ఆళ్ల హరి, రెల్లి సంఘ రాష్ట్ర నాయకులు సోమి ఉదయ కుమార్, నక్కల వంశీ, నారదాసు రామచంద్ర ప్రసాద్, బండారు రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.