Narsaraopeta: 100 మంది అనాధలకు భోజనం ప్యాకెట్లు పంచిన జనసేన

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నరసరావుపేట జనసేన పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ కృష్ణంశెట్టి గోవిందా ఆధ్వర్యంలో తుఫాన్ వర్షంతో ఇబ్బంది పడుతున్న 100 మంది అనాధలకు ఆదివారం భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అద్దేపల్లి ఆనందబాబు, మేడిశెట్టి రామారావు, కృష్ణంశెట్టి సిద్దయ్య, గుప్త శ్రీకాంత్, యనమల కొండ, రామ్ శెట్టి రామకృష్ణ, బోనం జయరాం, జమ్ముల బొర్రయ్య, దేవయ్య, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.