నిరుపేద గిరిజన వృద్ధులకు కంటి చికిత్సకై జనసేన చేయూత

  • ఆత్మకూరులో పవనన్న ప్రజాబాట 16వ రోజు

ఆత్మకూరు, జనసేనాని పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలన్న దృఢ సంకల్పంతో ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ నిర్వహిస్తున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం సోమవారం ప్రజల ఆశీస్సులతో 16వ రోజుకు చేరుకుంది. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో గతంలో గిరిజన కాలనీలో పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సుబ్బమ్మ మరియు రమణయ్య అను గిరిజన నిరుపేద వృద్ధులను సోమవారం స్థానిక ప్రైవేటు కంటి వైద్యశాలలో చూపించి వారికి మందులు ఇప్పించడం జరిగింది. తదుపరి పవనన్న ప్రజాబాట 16వ రోజు, నెల్లూరు పాలెం ముస్లిం బజార్లో నిర్వహించి స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికై మా వంతుగా పోరాడుతామని ఈ సందర్భంగా వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురేంద్ర, వంశీ, చంద్ర, పవన్, వేణు, తిరుమల, నాగరాజు, అనీల్, భాను, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.