జనసేన ఐ.టి. విభాగం కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు
జనసేన పార్టీ ఐ.టి. విభాగం రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియామక పత్రాలు అందచేశారు. ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఐ.టి. విభాగం సమావేశం అనంతరం సభ్యులను ప్రత్యేకంగా కలిశారు. పార్టీ బలోపేతానికి ఐ.టి. విభాగం తనవంతు తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఈ విభాగం ఛైర్మన్ శ్రీ మిరియాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 16 మంది సభ్యులతో ఐ.టి. విభాగం రాష్ట్ర కార్యవర్గాన్ని, పది జిల్లాలకు కో ఆర్డినేటర్లను నియమించిన విషయం తెలిసిందే. 16 మందిలో ఎన్.ఆర్.ఐ. విభాగం సభ్యులు మినహా మిగిలిన రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా కో ఆర్డినేటర్లకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియామకపత్రాలు అందచేశారు. పసుపులేటి సంజీవ్ కుమార్, ఉయ్యాల శ్రీనివాస్, చవ్వాకుల కోటేష్ బాబు, ఊరబండి ప్రసాద్, గేదెల సతీష్, అడపా వాసు, రావూరి తులసి తదితరులు నియామకపత్రాలు అందుకున్న వారిలో ఉన్నారు.