విశాఖ ఉక్కు పరిరక్షణ మనందరి బాధ్యత జనసేన నాయకులు

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్, పిలుపు మేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే డిజిటల్ క్యాంపెన్ కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గత మూడు రోజులుగా ప్లకార్డుల ప్రదర్శనం చేస్తూ చివరి రోజున స్థానిక గాంధీ విగ్రహం నందు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలంటూ ప్లకార్డుల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, మాట్లాడుతూ 32 మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ ఒక్క ఎంపీ కానీ అటు అధికార పార్టీ ఎంపీలు గానీ నిమ్మకు నీనెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢీల్లీకి తీసుకువెళ్లి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కరణం రవి, వెంకటేష్, షబ్బీర్, వినయ్, రమేష్, రషీద్, ఉరుకుందు, జనసైనికులు పాల్గొన్నారు.