అగ్నిప్రమాద బాధితులకు సహాయమందించిన జనసేన నాయకులు

పొన్నూరు నియోజవర్గం, చేబ్రోలు మండలం, సుద్దపల్లిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా 3 ఇళ్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్రీనివాస యాదవ్, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు శుక్రవారం బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి నిత్యావసర సరుకులను, కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఏమైనా సహాయం కావాలన్నా మేము ఉన్నాము అని వారికి ధైర్యం చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో చేబ్రోలు మండల అధ్యక్షులు శ్రీరాములు జిల్లా నాయకులు రామయ్య, నారిశెట్టికృష్ణ శివరామ కృష్ణ, శ్రీహరి, సత్యనారాయణ, గ్రామ అధ్యక్షులు మట్టుపల్లి భాను, నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.