“నేటి ధర్మబాణం” పక్ష పత్రిక ప్రారంభోత్సవంలో జనసేన నాయకులు

సాలూరు, మన్యం జిల్లా పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న “నేటి ధర్మబాణం” పక్ష పత్రిక ప్రారంభోత్సవం కార్యకమానికి పత్రిక యాజమాన్య ఆహ్వానం మేరకు జనసేన పార్టీ తరుపున రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కాద్యదర్శి బాబు పాలూరు, మన్యం జిల్లా నాయకులు పైల సత్యన్నారాయణ, అల్లు రమేష్, ఖత విశ్వేశ్వరరావు, గణేష్, మణికంఠ, వంశీ, ఉపేంద్ర మరియు సాలూరు నియోజకవర్గ నాయకులు చప్ప రమేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు పాలూరు మాట్లాడుతూ… పత్రికలు ప్రజా చైతన్యానికి నాంది అని, ప్రజల పక్షాన గొంతుకలని బాబు పాలూరు చెప్పటం జరిగింది.