కబ్జాలకి గురవుతున్న చెరువులను పరిశీలించిన జనసేన నాయకులు

పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మన జీవన విధానంలో మానవాళికి నిత్యం ఉపయోగపడేవి చెరువులు, అటువంటి చెరువులు కబ్జాలకి గురవుతున్నా, పట్టించుకోని వైనం మనం చూస్తున్నాం.. బొబ్బిలిలో సోమవారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు మరియు బొబ్బిలి జనసేన మండల అధ్యక్షులు గంగాధర్ కబ్జాలకి గురి అవుతున్న చెరువులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వందల ఎకరాల చెరువులు సైతం చిన్న చిన్న బందలుగా మార్చేస్తున్నా, చూస్తూ ఉండిపోతూ, పైగా మన చెరువులు కానట్టు చోద్యం చూస్తున్న బొబ్బిలి మున్సిపల్ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు, మరీ ముఖ్యంగా వైసిపి ప్రభుత్వానికి పర్యావరణ పరిరక్షణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శివకుమార్, సత్యనారాయణ, శివశంకర్ పోతల, బొన్నాడ గణేష్, కిరణ్ కుమార్, సంతోష్ తదితరులు పాల్గొనడం జరిగింది.