భైంసాలో జనసేన పార్టీ ఆందోళన

నిర్మల్ జిల్లా భైంసా, పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద, కేంద్ర కమిటీ ఆఫీస్ వద్ద రెక్కీని ఖండించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు. ఖబర్దార్ దుండగులరా మా సహనాన్ని పరీక్షించకండి. ఆయన అభిమానులు, పార్టీ నేతలు గల్లి నుండి ఢిల్లీ వరకు ఉన్నారు. అన్ని గమనిస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ, దాడికి యత్నించిన వారిని వారిని వెంటనే పట్టుకొని చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.