సామర్లకోట మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రమిచ్చిన జనసేన

పెద్దాపురం, సామర్లకోట టౌన్ జనసేనపార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న శానిటేషన్ సమస్యలపై శుక్రవారం పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్ట్ట్ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి బాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుంకర కృష్ణవేణి శ్రీనివాస్, సామర్లకోట టౌన్ జనసేన అధ్యక్షులు సరోజావాసు, జిల్లా కార్యదర్శులు పిట్టా జానకిరామారావు, కంచుమర్తి రాజన్న, సామర్లకోట మున్సిపల్ కమిషనర్ ని కలిసి సామర్లకోట పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న మలేరియా, డెంగ్యూ మరియు వీధుల్లో పేరుకున్న అపరిశుభ్రత, కలుషిత త్రాగునీరు, పందుల స్వైర విహారం తదితర అంశాలపై రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.