క్యాన్సర్ బాధితునికి ఆర్ధికసాయమందించిన జనసేన

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, అమలాపురం మండలం నల్లమిల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు గోకరకొండ ఆనంద్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న జనసేన నాయకులు మెండా శ్రీకాంత్, అమలాపురం రూరల్ మండల జనసేన అధ్యక్షులు లింగోలు పండు ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిమిత్తం 10,000 వేల రూపాయలు ఆనంద్ కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిరణ్ వేమవరప్పాడు ఉపసర్పంచ్ వాకపల్లి వెంకటేశ్వరావు, జనుపల్లి ఎంపిటిసి సభ్యులు పోలిశెట్టి చిన్ని, నల్లా వెంకటేశ్వరావు, అల్లాడ రవి, నల్లా సత్తిబాబు, గొకరకొండ కుమార్, కురచా శ్రీను తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఇన్ఫెక్షన్స్ ఆపరేషన్ నిమిత్తం 45 వేలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలియజేయగా ఇప్పుడు 10,000 అందజేయగా మిగిలిన మొత్తాన్ని పార్టీ నాయకులతో మాట్లాడి ఆపరేషన్ సమయానికి అందజేస్తామని లింగోలు పండు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.