ఏక్సిడెంట్ అయిన వ్యక్తికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన

కవిటి మండలం కొత్తకోజ్జిరియా గ్రామానికి చెందిన కామేష్ అనే అబ్బాయికి గత కొద్ది రోజుల క్రిందట ఏక్సిడెంట్ అయి హాస్పటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే అతను మళ్ళీ మాములు స్థితికి రావటానికి చాలావరకు డబ్బు ఖరచవుతుందని డాక్టర్స్ చెప్పారు. అయితే ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో సరైన వైద్యం చేయించుకోవటానికి దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయమని వేడుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పద్మనాదం పవనసేన సేవ సంస్థ తెలియజేయగా జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి పవన్ సేన సభ్యులు గురువారం సాయంత్రం పవనసేన సేవాసంస్థ సభ్యులతో కలిసి కొజ్జిరి గ్రామానికి చేరుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు మీకు మేము ఉన్నామంటూ భరోసా ఇస్తూ వాళ్లలో మనోధైర్యాన్ని పెంచి వాళ్ళ కుటుంబ సభ్యులకి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 8000 రూపాయలు ఆర్థిక సహాయం అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసైనికులు పవనసేన సేవాసంస్థ సభ్యులు పాల్గొన్నారు.