మన్యం రైతుకు అండగా నిలిచిన జనసేన

మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గం, జియ్యమ్మవలస మండలం, అలమండ పంచాయతీ, అప్పన్నదొర వలస గ్రామంలో గత పది రోజుల క్రితం పట్లాసింగి పండయ్యా అనే రైతుకు చెందిన 12 గొర్రెలు వేటకుక్కల దాడిలో మరణించడం జరిగింది.. ఆ కుటుంబాన్ని జనసేన నాయకులు నేరడ బిల్లి వంశీ, వాన ఉపేంద్ర, గార గౌరీశంకర్ ఆ కుటుంబాన్ని పరామర్శించి, ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అనంత్, రాజేష్, రజింత్, సంజు, శివాజీ, చిరంజీవి, రాంబాబు, గణేష్, భార్గవ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.