మాడుగుల నియోజకవర్గంలో జనసేన భారీ బైక్ ర్యాలీ

అనకాపల్లి జిల్లా, మాడుగుల నియోజకవర్గం, సెప్టెంబర్ 2వ తేదీ జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ముందుగా జనసైనికులు అందరూ శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పవన్ కళ్యాణ్ పేరు మీద అర్చనలు అభిషేకాలు చేసి అనంతరం మాడుగుల బస్ స్టాండ్ ఆవరణలో భారీ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేసారు. తదనంతరం మాడుగుల నియోజకవర్గ జనసైనికుల ఆద్వర్యంలో భారీ బైక్ ర్యాలీని ప్రారంభించి తొలుత మాడుగుల నుంచి ఎం కోడూరు వెళ్లి అక్కడ నుంచి చీడికాడ తరువాత దేవరపల్లి చేరుకొని అక్కడి నుంచి కె కోటపాడు వెళ్లి బైక్ ర్యాలీని ముగించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న జనసైనికులు పాల్గొని పార్టీ యొక్క బలాన్ని ప్రత్యర్థులకు తెలియజేసారు. అంతేకాక నియోజకవర్గం అన్ని గ్రామాలలో ప్రజలు జనసేన పార్టీ రావాలని ఆకాంక్షించి జనసైనికులందరికి శుభాభివందనాలు తెలియజేస్తూ పవన్ రావాలి పాలన మారాలి అని నినాదాలు చేసారు. ఏది ఏమైనా గతంలో కన్నా మాడుగుల నియోజకవర్గంలో జనసేన పార్టీ బాగా బలం పుంజుకుంది అని ఇవాళ బైక్ ర్యాలీలో జనసందోహం చూసి 2024లో జనసేన పార్టీ మంచి విజయం సాధించవచ్చు అని నియోజకవర్గంలో ఇంతమంది జనసైనికులు కలిసి ఇలా ఐక్యమత్యంగా ర్యాలీ చేయడం సంతోషంగా ఉంది అని పలు గ్రామస్థులు తెలుపుతూ 2024లో మా ఓటు నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ కే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో గల అన్ని మండలాల అన్ని గ్రామాల జనసైనికులు పాల్గొన్నారు.