21వ తేదీన తిరుపతిలో జనవాణి కార్యక్రమం

* రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు జిల్లాల సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న శ్రీ పవన్ కళ్యాణ్
ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జనవాణి కార్యక్రమం ఈ నెల 21వ తేదీన తిరుపతిలో జరగనుంది. ముందుగా చెప్పినట్లు రాయలసీమ ప్రాంతంలో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈనెల 21వ తేదీ, ఆదివారం తిరుపతిలోని జి.ఆర్.ఆర్ కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం మొదలుకానుంది. రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లా నుంచి కూడా ప్రజలు తమ సమస్యలను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావచ్చు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వయంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వీకరించి, సమస్యలను తెలుసుకుంటారు. ఇప్పటికే జనవాణి కార్యక్రమం విజయవాడలో రెండు విడతలు పూర్తి చేసుకోగా, భీమవరంలోనూ కార్యక్రమం ఇటీవల పూర్తయింది. నాలుగో విడత కార్యక్రమంగా తిరుపతిలో జనవాణి జరగనుంది. మూడు విడతల్లో ప్రజల వద్ద నుంచి వచ్చిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ ఆయా శాఖల వారీగా పరిష్కరించేందుకు జనసేన పార్టీ తరఫున ప్రత్యేక యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ శాఖలకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా లేఖలు రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *