Kothapeta: తెలుగుదేశం పార్టీ నుండి జనసేనలోకి వలసలు

కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నుంచి అధికారపక్ష వైస్సార్సీపీ నుంచి వలసలు మొదలయ్యాయి. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండల తెలుగుదేశంపార్టీ మాజీ అధ్యక్షులు వాడపల్లి దేవస్థానం మాజీ చైర్మెన్ శ్రీ చేకూరి కృష్ణంరాజు, చేకూరి సత్యనారాయణ రాజు మరియు సాగి సత్తిపండు రాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి జనసేన పార్టీ కండువా కప్పి బండారు శ్రీను స్వాగతం పలికారు. ఆత్రేయపురం మండలంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్ని వర్గాలవారిని కలుపుకుని పార్టీ కోసం పని చేస్తామని పార్టీలో చేరినవారు చెప్పారు.