ధవళేశ్వరం గణతంత్ర దినోత్సవ వేడుకలలో కందుల దుర్గేష్

తూర్పుగోదావరి, 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ధవళేశ్వరం స్థానిక బస్టాండ్ పక్కన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు పూలమాలవేసి జిల్లా కార్యవర్గ సమక్షంలో ఘనంగా జెండా వందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం స్వీట్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ భారతదేశ ఔనిత్యాన్ని, సాంప్రదాయాన్ని, సంస్కృతిని ఎల్లవేళలా కాపుడుకుంటూ భావితరాలకు వారసత్వంగా అందించాలని మరియు దేశ అభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. రాజమండ్రి రూరల్ గ్రామం ప్రజలకు, నాయకులకు, కార్యవర్గానికి మరియు జనసేన శ్రేణులకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు.