అగ్ని ప్రమాద భాదితులకు సహాయం అందజేసిన కాంతి శ్రీ

ఆదివారం ఉదయం ఎచ్చెర్ల నియోజకవర్గం, జి సిగడం మండలం, మర్రివలస గ్రామంలో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన భాదితులని ఎచ్చెర్ల జనసేన నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ కలిసి మాట్లాడటం జరిగింది. భాదితులకు గ్రామ యువత ఆధ్వర్యంలో కట్టబోయే ఇంటికి తన వంతు సహాయం అందిస్తామని మాట ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబాలకి నెలకి సరిపడా రేషన్ మరియు దుప్పట్లు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రంలో మర్రివలస గ్రామ జనసేన సర్పంచ్ అభ్యర్థి విక్రమ్ సందీప్, మర్రివలస వైస్ ప్రెసిడెంట్ పలిశెట్టి రమణ, విక్రం రవి, శంకర్, రమణ, ప్రవీణ్, ప్రసాద్, సాయి, సురేష్, రాజు బూర్ల,గేదులపేట జనసైనికులు పవన్, రామకృష్ణ మరియు లావేరు మండలం జనసైనికులు బార్నాల దుర్గారావు, కాకర్ల బాబాజీ పాల్గొన్నారు.