మహా న్యూస్ ఎండి వంశీ అరెస్టును ఖండించిన మదనపల్లి జనసేన

అన్నమయ్య జిల్లా, మదనపల్లిలో జర్నలిస్టులు జరిపిన నిరసన కార్యక్రమంలో వారికి మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం పాల్గొని మహా న్యూస్ ఎండి వంశీని అరెస్టు చేసిన విధానాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో మానవ హక్కులు మృగ్యమైపోయాయని అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తిలోదకాలిస్తున్నారని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వ్యవస్థలను అడ్డుపెట్టుకుని రాజ్య హింసకు పాల్పడుతున్నారని కేవలం ఇతురులు చేసిన దానికి రంగులు పూయడం, పేర్లు మార్చి కొత్త పేర్లు పెట్టడము తప్పు, ప్రజలకి పనికి వచ్చే పని ప్రభుత్వం చేయడం లేదు. అధికారంలో ఉన్న వీరికి బుద్ధి చెప్పే రోజులు త్వరలో వస్తాయని పేర్కొన్నారు జర్నలిస్టులకి జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. మీకోసం జనసేన గట్టిగా నిలబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.