జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: ఫిబ్రవరి 10 నుండి 28 వరకు జనసేన పార్టీ చేపట్టబోయే మూడవ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు అభిమానులు అందరూ విజయవంతం చేయవలసిందిగా పితాని బాలకృష్ణ కోరారు. శుక్రవారం ఉదయం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుమేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకం గా తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా గతంలో జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులు మరలా రెన్యువల్ చేయించుకోవాలని కొత్తగా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని అనుకునే వారికి ఇదొక మంచి అవకాశం అని తెలిపారు. గతంలో ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రమాదంలో మరణించిన ఎంతోమంది క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు ప్రమాద భీమా అందించినట్లు ఆయన తెలియజేశారు. కేవలం 500 రూపాయలు రుసుముతో ప్రమాదంలో మరణిస్తే 5 లక్షల రూపాయలు ప్రమాద భీమా మరియు ప్రమాదంలో గాయపడిన వారికి 50,000 రూపాయలు అందించే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని ఆయన తెలిపారు. జనసేన కార్యకర్తలకుప్రమాదం జరిగితే వారి కుటుంబానికి అండగా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఎంతో ఖర్చు పెట్టి ఇన్సూరెన్స్ కంపెనీకి భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారని వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *