Pithapuram: మనోధైర్యాన్నిచ్చిన మాకినీడి శేషుకుమారి

పిఠాపురం పట్నం 5వ వార్డులో ఇటీవల మరణించిన బొజ్జ గంగారావు ‌ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు బొజ్జ రామయ్య, కుమార్ పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి పరామర్శించారు. ముందుగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొజ్జ కుమార్, గరగ బాబీ, పల్నాటి మధుబాబు, మేళం బాబీ, వేల్పుల చక్రధర్, పుణ్యవంతుల సూర్య మూర్తి, బెల్లంకొండ రవి, ఆకుల అర్జునరావు, తోట సతీష్ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.