మాల మహానాడు ఆత్మీయ కలయిక కార్యక్రమంలో అంబేద్కర్ని కొనియాడిన మాకినీడి శేషుకూమారి

పిఠాపురం: కులమతాలకు అతీతంగా పి.వి రావు మాల మహానాడు ఆధ్వర్యంలో మాలల ఆత్మీయ కలయక వనభోజనాలు కార్యక్రమం స్థానిక విరవాడ రోడ్డు జోగ వారి తోటలో నిర్వహించడం జరిగింది. పరిసర ప్రాంత మాల సంఘాల ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అథిదిగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషకుమారి పాల్గొనగా మాలమహానాడు సభ్యులు మాకినీడి శేషకుమారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాకీనీడి మాట్లాడుతూ పి.వి రావు మాల మహానాడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నన్ను ఇంత గౌరవంగా చూసిన మహానాడు టీమ్ కి ధన్యవాదాలు తెయజేస్తున్నానని ఈ వాతవరంణం చూస్తుంటే మాలల ఉప్పెన ఉర్రూతలు కేరింతలు కనబడుతున్నాయని ఉత్సహంగా ప్రసంగించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం సమానత్వానికి పాటుపడుతూన్న మాల సోదరులకు అభినందనలు తెయజేస్తున్నామని ప్రతీ ఒక్కరం అంబేద్కర్ ఆశయ సాధనకై పాటు పడాలని అన్నారు. అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అనే భావంతో మెలగాలన్నాది నా ఆకాంక్ష అని అన్నారు. నన్ను ఈ కార్యక్రమమునకు ఆహ్వానించినందుకు మాల సోదర, సోదరిమణులకు జై భీములుతో కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మపు వరప్రసాద్, టౌన్ ప్రెసిడెంట్ వేలంగి వెంకటేష్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ మైనాబత్తుల చిన్న, జాయింట్ సెక్రటరీ శికొలు రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగు నూకరాజు, జిల్లా అధ్యక్షుడు బత్తిన శామ్యూల్, గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అమరది వల్లి రామకృష్ణ, బుర్రా సూర్యప్రకాష్, మేళం బాబి, యండ్రపు శ్రీనివాస్, కసిరెడ్డి నాగేశ్వరావు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.