మన సీతానగరం – మన జనసేన

పార్వతీపురం, మన సీతానగరం – మన జనసేన కార్యక్రమంలో భాగంగా సీతానగరం మండలంలో గల ఏగోటివలస గ్రామంలో జనసేన నాయకులు, జనసైనికులు పర్యటించడం జరిగింది. ప్రతీ ఇంటికి వెళ్ళి కరపత్రం ఇచ్చి జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ నాయకత్వం గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. ప్రభుత్వ వైఫల్యాలను వివరించడం జరిగింది. ప్రజల సమస్యలు అడిగి మరి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం జనసేన జిల్లా కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి అల్లు రమేష్ మాట్లాడుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరించిన ఏగోటివలస గ్రామ ప్రజలకు జనసేన పార్టీ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, అలాగే గ్రామంలో ఎటు చూసినా పారిశుధ్య లోపం బాగా కనిపిస్తుంది, అంగనవాడి కేంద్రం కూడా శిధిలావస్థలో ఉన్న పెంకుటిల్లులో నడిపిస్తున్నారు. అది వర్షం పడితే మొత్తం కారుతుంది, పెంకులు పడిపోతున్నాయి. ఈ రెండు సమస్యలను సంబంధిత అధికారులు దృష్టికి జనసేన పార్టీ తీసుకువెళ్తుంది, మీకు న్యాయం జరిగే వరకు పోరాడుతుంది అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జై శంకర్, మురళి, జయ ప్రకాష్, భాస్కర్, శ్రావణ్, గౌరీ నాయుడు, జనసైనికులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.