పలమనేరు జనసేనలో భారీ చేరికలు

పలమనేరు నియోజకవర్గ సీనియర్ నాయకులు సందీప్ రాయల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్బంగా సందీప్ మాట్లాడుతూ పార్టీని నియోజకవర్గంలో పార్టీ బలోపేతం దిశగా ముందుకు తీసుకుని వెళ్తామని, అదేవిధంగా రాబోవు ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే నిత్యం ప్రజా సమస్యలపై పోరాడతూ వారి సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్తుమన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు నాగరాజు మోతుకూరు, నియోజకవర్గ సీనియర్ నాయకులు రమేష్, టాక్సీ స్టాండ్ చిరంజీవి, రబ్బానీ, అస్లాం బాయ్, శబరీష్ రెడ్డి, భరత్ భూషణ్, రాజశేఖర్, జ్ఞాన శేఖర్, వినోద్, చైతన్య యాదవ్, వీకోట మండల ఉపాధ్యక్షులు అయాజ్ బాషా, కార్యదర్శి సుందర్, మరియు జనసేన నాయకులు సూరజ్, కళ్యాణ్, అర్శధ్, బాలాజి, షాహిద్, అమీర్, బాబు, ఇస్మాయిల్, చైతు, వినయ్, అసేన్ , ఆదిల్, సక్లైన్, లిఖిత్, చరణ్, సుబ్బు, రాజు, పంజాని మండల నాయకులు అజీమ్, నజీం, నవాజ్, మస్తాన్, నిస్సార్, అల్తాఫ్, ఆశిఫ్, నయీం, పీరు బాషా, హైదర్ తదితరులు పాల్గొన్నారు.