గూడపల్లి గ్రామంలో జనసేన భారీ బహిరంగ సభ

రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, గూడపల్లి గ్రామంలో జనసేన నాయకుల భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు మరియు గ్రామ శాఖ అధ్యక్షులు కొణిదెల శ్రీనివాస్ అధ్యక్షతన, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ, రాష్ట్ర మత్స్యకార విభాగ అధ్యక్షులు నరసాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేన పార్టీ క్రియాశీలక కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.

కార్యక్రమంలో భాగంగా.. అధిక సంఖ్యలో దళిత నాయకులు, అగ్నికుల క్షత్రియ నాయకులు, బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండుబోగుల పెద్దకాపు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దిరిశాల బాలాజీ, తాడి మోహన్ కుమార్, రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి పోన్నల ప్రభ, జిల్లా ఉపాధ్యక్షులు సిరినీడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, జిల్లాకార్యదర్శి గుండా బత్తుల తాతాజీ, పినిశెట్టి బుజ్జి, ఆర్.డి.ఎస్ ప్రసాద్, రావూరి నాగు, పోతు కాశి, వైస్ ఎంపీపీ సుందర శ్రీను, ఇంటిపల్లి ఆనందరాజు, మండల అధ్యక్షులు గుబ్బల పణికుమార్, దొడ్డ జయరాం, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు అడబాల తాతకాపు, ఎంపీటీసీలు జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్, దార్ల కుమారి లక్ష్మి, పున్నం నాగమణి, రాపాక సత్యనారాయణ ఆవుపాటి శివ జ్యోతి, ఉండపల్లి అంజి, ముత్యాల సాయిరాం, అల్లూరి రంగరాజు గొల్లమందల పూర్ణచంద్రరావు, ఎనుముల బాబ్జి, సుందర కొండబాబు, సుందర, బ్రహ్మయ్య, సుందర పండు, కృష్ణమూర్తి, బాబీ నాయుడు, బోనం భాస్కర్, మేడిచర్ల ప్రసాద్, చింతరాజు, చింత ప్రసాద్, కాట్రేనిపాడు నాగేంద్ర, పోలిశెట్టి గణేష్, బాబి, మణికంఠ, ప్రసాద్, శ్రీను, దొరబాబు, సురేష్ గ్రామంలోని జనసేన నాయకులు, వార్డు మెంబర్లు, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.