18న కడపలో జన సైనికులతో నాదెండ్ల మనోహర్ సమావేశం

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉమ్మడి కడప జిల్లాలో నిర్వహించే కౌలు రైతు భరోసా యాత్రకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 20వ తేదీన నిర్వహించబోయే కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా సిద్ధవటంలో సభ నిర్వహిస్తారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం సిద్ధవటంలోని సభా ప్రాంగణాన్ని పరిశీలించి నాయకులతో సమీక్షిస్తారు. సాయంత్రం కడపలో జన సైనికులతో సమావేశం నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర సదుద్దేశాన్ని వివరిస్తారు. ఉమ్మడి కడప జిల్లాలో పార్టీ కార్యకలాపాల నిర్వహణపై దిశా నిర్దేశం చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *