రాష్ట్ర డాక్టర్స్ సెల్, జనసేన ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

తుఫాను వరద ముంపు ప్రాంతాల్లో జనసేన పార్టీ రాష్ట్ర అధిష్టానం జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తిరుపతిలో మంగళవారం పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ చివరిగా స్థానిక సుబ్బారెడ్డి నగర్, కొత్తపల్లి ప్రాంతాలలో జనసేన పార్టీ అండతో రాష్ట్ర డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరానికి జనసేన పిఎసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ మరియు రాష్ట్ర నాయకులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్, డాక్టర్ బొడ్డేపల్లి రఘు, కిరణ్ రాయల్ తో పాటు జిల్లా నాయకులు స్థానిక జనసైనికులు హాజరై ఆ ప్రాంతంలోని ప్రజలకు భరోసా కల్పిస్తూ ఈ శిబిరంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ హెల్త్ కార్యక్రమంలో సుబ్బారెడ్డి నగర్, కొత్తపల్లి, చంద్రశేఖర్ రెడ్డి కాలనీ, సుభాష్ నగర్, అక్కరంపల్లి తదితర ప్రాంతాల నుండి జనం విచ్చేసి హెల్త్ చెకప్ చేయించుకొని ఉచితంగా మందులను పొందారు.