పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే చేసే అసత్యపు ప్రచారాలు మానుకోవాలి : శేషుబాబు

అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ ఓటమి భయంతో పదే పదే పవన్ కళ్యాణ్ మీద తప్పుడు ప్రచారాలు చెయ్యడం మానుకోవాలి. జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. రాష్ట్రంలో రాజ్యాధికారానికి దూరమవుతున్న ప్రజలకు రాజ్యాధికారం అందించే లక్ష్యంతో జనసేన పార్టీ పనిచేస్తుంది. సింహాద్రి రమేష్ మీరు పవన్ కళ్యాణ్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ, కాపు కులం ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు. జనసేన పార్టీ ఒక కులానికి చెందిన పార్టీ అని తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు. కాపు, ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీలకు రాజ్యాధికారం రాకూడదని మీ అభిప్రాయంలా కనిపిస్తుంది. వైసీపీ కూడా ఒక కులానికి చెందిన వారసత్వ, కుటుంబ పార్టీ అని గుర్తు పెట్టుకోవాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరుఫున కాపు, ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీల నుండి ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అరిగిపోయిన ప్రశాంత్ కిషోర్ తప్పుడు వ్యూహాలు ఎన్ని సార్లు ప్రచారం చేసినా ప్రజలు ప్రస్తుతం నమ్మే పరిస్థితిలో లేరు. 2019 ఎన్నికల్లో మీ తప్పుడు వ్యూహాలు పనిచేశాయి ఈసారి ప్రజలు గ్రహించారు వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని తరిమికొట్టడం ఖాయం. ప్రశాంత్ కిషోర్ కూడా జగన్ రెడ్డి పదవి కాంక్ష తీర్చి తప్పు చేశాను అని చెప్పడం కూడా మనం చూశాం. మొన్న ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కూడా ఇప్పుడు అనవసరంగా వైసీపీని గెలిపించానని భాధతో మాట్లాడిన వీడియోలు రాష్ట్రం మొత్తం చూశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నారు. మీ అప్పులు, రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడం వలన యువత ఎంతో నష్టపోయారు. యువత కూడా వారసత్వ, కుటుంబ పార్టీల అసమర్థ పాలన పట్ల విసుగు చెందారు. ఎంతసేపు అధికారం కొంతమంది చేతుల్లోనే ఉండిపోవడం కూడా యువతలో మరింత కసి పెంచింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక యువత జనసేన వైపు ఓటు వేస్తారు అనేది అక్షర సత్యం. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రాబోతుంది అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ విజయం సాధించడం ఖాయం అని గుడివాక శేషుబాబు అన్నారు.