మాతృ దినోత్సవం సందర్భంగా తిప్పన దుర్యోధన రెడ్డి తల్లికి సన్మానం

ఇచ్చాపురం, పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఇచ్చాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి ఈ మూడు సంవత్సరాల కాలంలో తోటి జనసైనికులు సాయంతో 5,000 మందికి పైగా రక్తదానం చేసిన కారణంగా ఆదివారం మదర్స్ డే సందర్భంగా పలాసలో ఆ నలుగురు సేవా సంస్థ తరుపున దుర్యోధన రెడ్డి వాళ్ళ అమ్మ గారికి సన్మానం చేయడం జరిగింది. నాకు ఇంత పేరు తెచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సన్మానం అంకితం ఇలానే ముందు ముందు ఇంకా ఎక్కువ మంది వచ్చి రక్తదానం చేస్తారని కోరుకుంటున్నాం అని తెలియజేశారు.