చెన్నాడం డిజిటల్ క్యాంపెయిన్ కు సంఘీభావం తెలిపిన ఎంపీపీ సత్యవాణి రాము

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కు అనే నినాదంతో రాజోలు మండలం చెన్నాడం గ్రామంలో బడుగు శ్రీనివాస్ మరియు గ్రామ జనసైనికులు, వీరమహిళలు చేస్తున్న నిరసనకు సంఘీభావం తెలుపుటకు మలికిపురం మండల ఎంపీపీ శ్రీమతి మేడిచర్ల సత్యవాణి రాము చెన్నాడం గ్రామాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లడుతూ వైఎస్సార్సీపీ, టిడిపి ఎంపిలకు చిత్తశుద్ది ఉంటే పార్లమెంటులో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలియజేయాలని ఆమె అన్నారు. జనసేన నాయకుడు బడుగు శ్రీనివాస్ మాట్లాడుతూ నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన అందుకు ప్రజలను మభ్యపెట్టి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుల్లింక గంగాధరం, రేకపల్లి సురేష్, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.