ఉషా రాజుని పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజమండ్రి, గోకవరం బస్టాండ్ దగ్గరలో గల సాయి హాస్పిటల్ లో జనసేన నాయకులు లోవుశెట్టి రాజు అమ్మాయి ఉషా రాజు అనారోగ్య రీత్యా హాస్పిటల్ లో జాయిన్ చేసారని తెలుసుకున్న జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో కూడా చర్చించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కుటుంబ సభ్యులకు అండగా వైద్య ఖర్చులు నిమిత్తం ₹10000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వీరి వెంట జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.