కురిచేడు గ్రామంలో ‘నా సేన కోసం నా వంతు’

దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం కురిచేడు గ్రామంలో వీరమహిళలు లక్ష్మీ మరియు జగదీశ్వరి ల ఆధ్వర్యంలో జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు నిర్వహించడం జరిగింది .అనంతరం దర్శి నియోజకవర్గంలో జనసేనకు ఇంత గుర్తింపు తీసుకువచ్చి వీరమహిళలలో ధైర్యాన్ని కల్పిస్తున్న వరికూటి నాగరాజు కి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వరికూటి నాగరాజు, డిప్యూటీ డీఈఓ లక్ష్మయ్య, షేక్ ఇర్షాద్ లను వీర మహిళలు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దర్శి, కురిచేడు, దొనకొండ మండలాల జనసైనికులు పాల్గొనడం జరిగినది.