నరవ గ్రామంలో ‘నా సేన కోసం నా వంతు’

పెందుర్తి నియోజకవర్గం, నరవ గ్రామం, 88 వ వార్డు జనసేన అధినేత పిలుపుమేరకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమాన్ని 88వ వార్డు, పెందుర్తి నియోజకవర్గం, నరవ గ్రామంలో రామాలయం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను మమేకం చేయడానికి ‘నా సేన కోసం నా వంతు’ క్యాంపెయినింగ్ టెంట్ వేసి ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు చాలా సులభంగా వారి మొబైల్ నుంచి పార్టీ నంబర్ 7288040505 కి ఫోన్ పే, గూగుల్ పే మరియు పేటిఎం ద్వారా ‘నా సేన కోసం నా వంతు’ లో భాగం అవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వబ్బిన శ్రీకాంత్, ప్రవీణ్, బొడ్డు నాయుడు, శ్రీను, శివ మరియు జనసైనికులు పాల్గొన్నారు.