క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకున్న నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా సాగుతోంది. ఈ కార్యక్రమం మలివిడతగా ఫిబ్రవరి 21 వ తేదీ ప్రారంభమైంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. మనోహర్ హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కోర్ టీం టి. కిషోర్, శ్రీమతి ఏ.జయ కళ్యాణి(జనసేన పార్టీ అడ్మిన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ),ఏ.అనీల్, వై. సుధీర్ లు పాల్గొన్నారు.