జోగి కాదు నీ పేరు రోగి అని పెట్టుకో: ఎస్.వి.బాబు

పెడన: సైకోల సంఘం అధ్యక్షుడు, దుర్ముహూర్తంలో పుట్టిన దుర్మార్గుడు జోగి రమేష్ ప్రగల్బాలు శృతి మించాయని పెడన నియోజకవర్గం జనసేన నాయకులు ఎస్.వి.బాబు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ..

*పవన్ కళ్యాణ్ గారి నామస్మరణ చేయకపోతే జోగికి పూట గడవని పరిస్థితి

*జోగి!… నువ్వు గృహ నిర్మాణ శాఖ మంత్రివా.. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే శాఖ మంత్రి వా రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదు

*మంత్రి శాఖ నిర్వహణలో విఫలమై, 2024 లో ఎమ్మెల్యే సీటు వస్తుందో, రాదో అనే కన్ఫ్యూజ్ లో మతిభ్రమించి జోగి పిచ్చివాగుడు వాగుతున్నాడు

*ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల తో సహా అన్ని వర్గాలను నయవంచన చేసిన మీ పార్టీకి 2024లో చావు ముహూర్తాన్ని ప్రజలు ఆల్రెడీ నిర్ణయించారు

*ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, మీ పీడ ఎప్పుడు విరగడవుతుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చేది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అన్ని వర్గాల ప్రజలు కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు

*2024లో జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తుంది

*నువ్వు, నీ యజమాని, నీ అల్లరి మూకలు చరిత్ర హీనులు కావడం తథ్యం అని ఎస్.వి.బాబు హితవుపలికారు.