శింగనమల మండలంలోని వివిధ గ్రామాల్లో నేటికి అందని వృద్ధాప్య పెన్షన్లు

జనసేన పార్టీ శింగనమల నియోజకవర్గం. శింగనమల మండలంలోని వివిధ గ్రామాల్లో నేటికీ వృద్ధాప్య పెన్షన్లు అందలేదు. పెన్షన్లు సక్రమంగా సకాలంలో అందక గ్రామాల్లోని పెన్షన్ దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పై స్పందిస్తూ.. జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తమ రెడ్డి, మండల అధ్యక్షుడు తోట ఓబులేషు మాట్లాడుతూ.. ఈ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు ఒకటో తారీకున సకాలంలో పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోందని కానీ నేటికీ కూడా.. పెన్షన్ ఇవ్వకుండా ముసలివాళ్ళకి, వితంతువులకు, వికలాంగులకు పండగ పూట కూడా ఫించన్లు ఇవ్వక వారికి తీరని అన్యాయం చేస్తోందని.. కనీసం పెన్షన్లు ఎందుకు ఇవ్వలేదో కూడా తెలియజేయలేక పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి రెండు రోజుల్లో పెన్షన్ దారులకు పెన్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తోట ప్రవీణ్ సాయి శంకర్, తదితరులు పాల్గొన్నారు.