పీఏసీ సభ్యులు నాగబాబుతో జనసేన నాయకుల మర్యాదపూర్వక భేటీ

రాజమండ్రి విచ్చేసిన జనసేన పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబును జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలిసిన వారిలో అమలాపురం రూరల్ చిందాడగరువు జనసేన పార్టీ ఎంపిటిసి మోటూరి కనకదుర్గ, పవన్ కళ్యాణ్ సేవాట్రస్ట్ అధ్యక్షులు మోటూరి వెంక టేశ్వరరావు, రాష్ట్ర నాయకురాలు కొప్పుల నాగ మానస వున్నారు.