రౌడీ సేన అనడాన్ని తీవ్రంగా ఖండించిన పాలకొండ జనసేన

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ జనసేన జానీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి జనసేన పార్టీని ఉద్దేశించి జనసేన రౌడీ సేన అని అనడం తీవ్రంగా ఖన్డిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ లో 3వేల మంది కౌలు రైతులు మరణింస్తే ఒక్కరికి కూడా మీరు ఎలాంటి ఆర్ధిక సహకారం చెయ్యకపోయినా… రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఒకొక్కరికి లక్ష రూపాయిల చొప్పున 30 కోట్లు పంచి ఆ కుటుంబాలని ఆదుకున్నందుకా అని ప్రశ్నించారు. మత్స పుండరీకం మాట్లాడుతూ పేద ప్రజలకి 28 లక్షలు ఇల్లు కట్టి ఇస్తామని చెప్పి ఒక్క ఇల్లు మీరు కట్టి ఇవ్వకుండా మీరు చేసిన మోసాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసినందుకా..? అని ప్రశ్నించారు. కర్నెన సాయి పవన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఇసుక దొరకక భవన నిర్మాణ కార్మికులు పనులు లేక వారి కుటుంబాలు రోడ్డున పడి వాళ్ళు ఎంత ఆర్ధికంగా నష్టపోయారో గుర్తు చేసి వాళ్ళకి అండగా ఉన్నందుకా..? అని ప్రశ్నించారు.