పవనన్న ప్రజాబాట.. వాళ్ళెపేట ఉపాధి కూలీలతో కరిమజ్జి మల్లీశ్వారావు భేటీ

*పవనన్న ప్రజాబాట 55వరోజు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, వాళ్ళెపేట గ్రామ చెరువులో జనసేన పార్టీ నాయకులు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు గారు జనసేన పార్టీ యంపీటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు మంగళవారం ఉదయం చెరువులో పర్యటించి.. చెరువులో ఉన్న ఉపాధి కూలీలు ప్రతి ఒక్కరినీ కలవడం జరిగింది. జనసేన పార్టీ మేనిఫెస్టో గురించి ప్రతి మహిళకు, యువతకు,పెద్దలకు, తెలియజేస్తూ.. పవనన్న ప్రజాబాట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి 55 రోజులు పాటు సుదీర్ఘంగా ప్రజల దగ్గరకు వెళ్ళి పలు కుటుంబాలను పలకరిస్తూ.. విజయవంతంగా ముందుకు సాగడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో కరిమజ్జి మల్లీశ్వారావు మాట్లాడుతూ.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో బాగంగా 3000 మంది చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలను నేరుగా పరామర్శించి.. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు విరాళం అందిస్తున్న.. గొప్ప మనసున్న నాయకుడని.. అలాంటి నాయకుడిని కాపాడు కోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాగే వివిధ విషయాలు గురించి వివరించి వాళ్లకు అవగాహన కల్పించారు. కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అలాగే వృద్దులతో మాట్లాడుతూ సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. పవనన్న ప్రజాబాట తాము ప్రారంభించిన ప్రజలనుండి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇద్దాం అని ఓటేసిన వారెవరూ ఈసారి వైసిపి కి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో వాళ్ళెపేట గ్రామ భద్రయ్య, సత్యనారాయణ, సూర్యారావు, మధు, శ్రీను, మహిళలు తదితరులు పాల్గొన్నారు.