పవన్ కళ్యాణ్ గారూ క్రైస్తవులను ఆదరించండి.. బిషప్ మార్టిన్ కాట్రగడ్డ

  • ప్రీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న గునుకుల కిషోర్
  • క్రైస్తవులను వైసిపి, టిడిపి ప్రభుత్వాలు మోసగించాయి.. జనసేన తరపున వారిని ఆదరించమని మా మాటగా పవన్ కళ్యాణ్ గారి కి తెలుపవలసింది.. బిషప్ మార్టిన్ కాట్రగడ్డ

నెల్లూరు: ప్రముఖ న్యాయవాది డాక్టర్ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కావలిలో జరిగిన ప్రీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా దగ్గు మాటి కృష్ణారెడ్డి తో జనసేన పార్టీ తరపున అతిథిగా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ దైవవర్తమానికులు బిషప్ మార్టిన్ కాట్రగడ్డ చేసిన ప్రేయర్ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బిషప్ మార్టిన్ మాట్లాడుతూ కులమతాలు ఏమీ లేవు, ఎవరి నమ్మకాలు వారివి క్రైస్తవు అనేది మతం కాదు ఒక నమ్మకం అని, అందరం భారతీయులమని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ.. టిడిపి, వైసిపి ప్రభుత్వాలు క్రైస్తవులను మోసం చేశాయని, వారిని జనసేన పార్టీ తరఫున ఆదరించాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారికి నా మాటగా తెలుపవలసిందిగా కోరారు. ఈ సభలో గునుకుల కిషోర్ మాట్లాడుతూ ఇతరులు చేసిన పాపాల కోసం క్రీస్తు మరణించెను అనే వాక్యాన్ని చిన్నప్పుడు చదువుకున్నానని, జీవన గమనంలో అనేక అనేకసార్లు సమస్యలు ఎదురైనప్పుడు నా మిత్రులు, మామ శివ ప్రసాద్ రెడ్డి కొన్ని సమస్యలు నాకు ఎదురైనప్పుడు ప్రేయర్ చేసి ధైర్యాన్నిచ్చిన మా మామ డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారు నమ్మిన దైవ దూత జీసస్ ను నేను కూడా నమ్ముతున్నానని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి కృష్ణారెడ్డితో పాటు బిషప్ మార్టిన్ కాట్రగడ్డ, డాక్టర్ శివప్రసాద్ రెడ్డితో పాటు, ఇతర క్రైస్తవులు ఆరాధకులు పాల్గొన్నారు.