జనసేన క్రియాశీలక సభ్యుడు కొంగరి సైదులు కుటుంబానికి జనసేనాని పరామర్శ

• కొంగరి సైదులు భార్యకు రూ. 5 లక్షల బీమా చెక్కు
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లా గోపరాజుపల్లికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు కొంగరి సైదులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సైదులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అతని భార్య సుమతిని ఓదార్చారు. సైదులు కుమారుడు కూడా ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకుని ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన సైదులు కుటుంబానికి అన్ని విధాల జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బిడ్డల చదువు, ఆరోగ్యం బాధ్యతను కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అనంతరం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు ఇచ్చే రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును శ్రీమతి కొంగరి సుమతికి అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు రామ్ తాళ్లూరి, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు మేకల సతీష్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, విద్యార్ధి విభాగం నాయకుడు సంపత్ నాయక్, యువజన విభాగం నాయకుడు లక్ష్మణ్ గౌడ్, పార్టీ నాయకుడు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Avatar