అర్జిల్లి ముత్యాలమ్మ కుటుంబానికి పెందుర్తి జనసేన భరోసా

అనకాపల్లి జిల్లా, పెందుర్తి నియోజకవర్గం, పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయితీలో 2017 సంవత్సర నుండి జనసేనపార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి అర్జిల్లి ముత్యాలమ్మ ఇంటిని ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో అర్జిల్లి ముత్యాలమ్మ స్వర్గస్థులు అయ్యారని చెప్పడానికి చింతిస్తున్నాము. జనసేనపార్టీ తరుపున ఆమెకు ఘన నివాళి అర్పిస్తున్నాము. భవిష్యత్తులో ఆమె కుటుంబ సభ్యుల(కుమారుడు అర్జిల్లి మురళి)కు జనసేనపార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, ముత్యాలమ్మ పాలెం గ్రామ పంచాయితీ జనసేనపార్టీ తరుపున 6 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యాలయంలో జనసేనపార్టీ నాయకులు అర్జిల్లి అప్పలరాజు, బొంది ముత్యాలు, సమ్మంగి అప్పారావు, చింతకాయల ముత్యాలు, సమ్మంగీ లోవరాజు, అర్జిల్లి ఎర్రయ్య, చింతకాయల లక్షణరావు, బొంది చిన ముత్యాలు, అర్జిల్లి అప్పలరాజు పాల్గొన్నారు.