క్రియాశీలక సభ్యునికి ఇన్సూరెన్స్ చెక్ అందజేసిన పితాని

ముమ్మిడివరం, ఇటీవల ఏక్సిడెంట్ లో గాయపడిన ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామ జనసేన నాయకులు మునికోటి శ్రీనివాసరావుకు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ నుంచి పంపిన 50,000 రూపాయలు చెక్ ను గురువారం జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ చేతుల మీదుగా శ్రీనివాసరావుకి అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోదశి పుండరీష్, జక్కంశెట్టి పండు, గొలకోటి వెంకన్నబాబు, మాదాల శ్రీధర్, సలాది రాజా, గంజా యేసు, గాలిదేవర మణి తదితరులు పాల్గొన్నారు.