నిరుపేదల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్: డాక్టర్ యుగంధర్ పొన్న

కార్వేటినగరం మండలం గాజంకి గ్రామపంచాయతీ, గాజంకి గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదటి విడతగా గ్రామస్తులకు జనసేన ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ నిరుపేదల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ మాత్రమేనని, ఎన్నికలే లేని ఈ సందర్భంలో ప్రజా సేవే మార్గంగా సామాజిక, రాజకీయ సేవలు అందిస్తున్నది జనసేన పార్టీ మాత్రమేనని తెలిపారు. జనం కోసమే జనసేన పార్టీ ఉన్నదని, ఏదో ఆశించి జనసేన పనిచేయడం లేదని తెలియజేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లి, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్ర మౌళి, కార్యదర్శి హరీష్, సీనియర్ నాయకులు అప్పోజయ్య, జనసైనికులు అబ్రహం, వినోద్, చిరంజీవి, నాగరాజు, భాస్కర్, లోక, శేఖర్, సింహాద్రి పాల్గొన్నారు.