కన్నుల పండుగగా నేతి వేంకటేశ్వరుడి ప్రభ ఊరేగింపు

దేవరంపాడు లో వెలసిన నేతి వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలో జనసేన పార్టీ, కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో భారీ ప్రభతో వీధులలో ఉరేగింపు చేశారు.. 35 అడుగుల ఎత్తు తో ఏర్పాటు చేసిన ప్రభలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ ను మధ్యలో అందంగా ఏర్పాటు చేశారు.. చేరువుకట్ట బజారు నుండి మొదలైన ఉరిగింపు కార్యక్రమంలో 300 మందికి పైగా జనసేన కార్యకర్తలు పాల్గోన్నారు.. ముఖ్య అతిధులు కొబ్బరికాయలు కొట్టి.. ప్రభ ఊరేగింపు మొదలు పెట్టారు.. కనకదుర్గమ్మ గుడి మీదుగా.. దేవరంపాడు వరకు కాలినడకన పాటలతో చేరుకున్నారు.. అనంతరం వేంకటేశ్వరుడిని దర్శించుకుని.. 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల జనసేన పార్టీ అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, బీజేపీ గురజాల కన్వీనర్ అంబటి నవకుమార్, జిల్లా కార్యదర్శి బడిదెల శ్రీను, అంబటి మల్లి, దాచేపల్లి, గురాజల జనసేన మండల అధ్యక్షులు మందపాటి. దుర్గారావు, ఉప్పిడి నరసింహారావు, దేశినేని రాంబాబు, కొలా చలపతి, నూతి సూర్యనారాయణ, బయ్యవరపు రమేష్, చిదేళ్ల రాం, వెంకటరమణ, గుర్రం కోటి బ్రదర్స్, నంబురి శ్రీను, అడపా వెంకట్, నూతి సంధ్యారాణి, శ్రీలత, సురేష్, సాయి, రామాంజి, అశోక్, రవి, మొదలగు జనసైనికులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.