జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ని కలిసిన ప్రశాంత్ పోరెడ్డి

పాలకొండ: జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ని కలిసిన పాలకొండ నియోజకవర్గ నాయకులు ప్రశాంత్ పోరెడ్డి. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు గా ఉన్న తోటపల్లి ఎడమకాలువ, జంపరకోట డ్యామ్ లను త్వరగా పూర్తి చేస్తే పాలకొండ లో ఉన్న సుమారు 70000 నుండి 100000 ఎకరాల రైతులు బాగుపడతాయని, పాలకొండ మరో గోదావరి ప్రాంతంగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ కి తెలియజేయడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి రాబోయే రోజుల్లో ఈ సమస్య కోసం మాట్లాడతానని తెలియజేసారు.