తక్షణం రాజంపేటను జిల్లాగా ప్రకటించాలి: మాదాసు నరసింహ

రాజంపేటను, అన్నమయ్య జన్మించిన,నడయాడిన తాళ్ళపాక నుండి తిరుమల పాదయాత్రను రాజంపేట, కోడూరు, కుక్కలదొడ్డి ప్రాంతంమీదుగా వెళ్ళారా❓లేక అన్నమయ్య నడయాడిన ప్రాంతానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయచోటి మీదుగా వెళ్ళారా❓ఇంకా మరెన్నో అర్హతలు, విశిష్టతలు, సదుపాయాలు కలిగిఉన్న రాజంపేట కాదని రాయచోటిని జిల్లాగా ప్రకటిస్తూ అన్నమయ్య జిల్లాగా నామకరణం చేయడం అన్యాయమని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు ప్రతి పార్లమెంటు జిల్లాగా ప్రకటిస్తానని మాట ఇచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రి మాట తప్పుతున్నారు. రాజంపేట అన్ని విధాలుగా భౌగోళికంగా రోడ్ లైన్, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, అన్ని సౌకర్యాలు కలిగినటువంటి రాజంపేటను విస్మరించి అన్నమయ్య నామమును పెట్టుకొని మనకు రాజంపేట ప్రజలకు పంగనామాలు పెట్టాలని చూస్తున్నారు వారికి. అయ్యా మీరు కావాలంటే 36 జిల్లాలు చేసుకోండి శ్రీకాంత్ రెడ్డి రాజంపేట ప్రజల మధ్య రాయచోటి మధ్య వైరం వచ్చే పరిస్థితి తీసుకురావద్దు రాజంపేట ప్రజలు ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకెళ్ళి రాజంపేట అన్నమయ్య జిల్లాగా ప్రకటించే వరకు అన్ని పార్టీల వారు పోరాడాలని మాదాసు నరసింహ అన్నారు.